For Money

Business News

యూనిటెక్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్‌

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యూనిటెక్‌ వ్యవస్థాపకుడు రమేష్‌ చంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. ఆయన కోడలు ప్రీతి చంద్రను కూడా అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద వీరిని అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి కార్నౌస్టి మేనేజ్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ మాలిక్‌ను కూడా అరెస్ట్‌చేశారు. రమేష్‌ చంద్ర కుమారులు సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్ర ఇప్పటికే ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు. ఇళ్ళు నిర్మించి ఇస్తామని 29800 మంది నుంచి రూ. 14270 కోట్లు వీరు వసూలు చేసినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బయట పడింది.