For Money

Business News

Srei ఇన్‌ఫ్రా, Srei ఫైనాన్స్‌ బోర్డుల రద్దు

Srei ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, Srei ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ల గవర్నింగ్‌ బోర్డులను భారత రిజర్వు బ్యాంక్‌ రద్దు చేసింది. ఇన్‌ఫ్రా రంగంలో అత్యంత కీలకమైన ఈ రెండు కంపెనీలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ రెండు కంపెనీల బోర్డులను రద్దు చేసి అడ్వజర్ల కమిటీనిను ఆర్‌బీఐ నియమించింది. ఈ రెండు కంపెనీల నిర్వహణను ఈ అడ్వయిజర్ల కమిటీ చూసుకుంటుంది. ఈ కమిటీకి అడ్మినిస్ట్రేటర్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రజనీష్‌ శర్మను నియమించారు. Srei గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీలు డీఫాల్ట్‌ కావడంతో వెంటనే ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. త్వరలోనే ఈ రెండు కంపెనీల దివాలా చర్యలను ఆర్బీఐ ప్రారంభించనుంది.