For Money

Business News

20 శాతం పెరిగిన IOB

ఇండియన్ ఓవర్‌ సీస్‌ బ్యాంకుపై అమల్లో ఉన్న ప్రామ్ట్ కరెక్టీవ్ యాక్షన్ (PCA) నిబంధనలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఇవాళ ఆ బ్యాంక్‌ షేర్‌ 20 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ బోర్డు పరిశీలన తర్వాత ఇండియన్ ఓవర్శీస్ బ్యాంకు PCA ప్రమాణాలకు లోబడి ఉందని గుర్తించి సదరు ఆంక్షలను ఆర్‌బీఐ తొలగించింది. దీంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏకంగా 20శాతం పెరిగి రూ. 24.50కి చేరింది. గరిష్ఠ ధర వద్ద ఒత్తిడి రావడంతో ఇపుడు 13 శాతం లాభంతో రూ. 23.05 వద్ద ట్రేడవుతోంది.