For Money

Business News

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఏకంగా పది చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరికాస్సేపట్లో ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సీబీఐ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.