For Money

Business News

సీల్డ్‌ కవర్‌ సంస్కృతికి సుప్రీం కోర్టు నో….

అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంతో స్టాక్‌ మార్కెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు గత సోమవారం సూచించింది. దీనికి అంగీకరించిన కేంద్రం ఇవాళ సీల్డ్‌ కవర్‌లో నిపుణుల బృందం పేర్లను సుప్రీం కోర్టుకు అందించింది. అయితే సీల్డ్‌ కవర్‌ సంస్కృతికి తాము వ్యతిరేకమని, ఈ వ్యవహారంలో పూర్తి పాదర్శకత అవసరమని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన పేర్లను తాము ఆమోదించమని పేర్కొంది.