For Money

Business News

54 శాతం పెరిగిన ఎన్‌సీసీ లాభం

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.117 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ.76 కోట్ల లాభంతో పోలిస్తే 54 శాతం పెరిగింది. కంపెనీ టర్నోవర్‌ ఇదే త్రైమాసికంలో రూ.2,334 కోట్ల నుంచి రూ.2,817 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 80 పైసల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.