దివీస్ Q4 నికర లాభం రూ. 502 కోట్లు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.388 కోట్లలు. ఇదేకాలంలో కంపెనీ టర్నోవర్ కూడా రూ.1,466 కోట్ల నుంచి రూ.1,812 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2020-21కి రూ.7,032 కోట్ల ఆదాయం పై రూ.1,984 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. రూ.400 కోట్ల పెట్టుబడులతో చేపట్టిన కస్టమ్స్ సింథసిస్ ప్రాజెక్టులో కొంత భాగం పూర్తయిందని, ఇది పని చేయడం ప్రారంభించిందని తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరానికి తమ వాటాదారులకు 1000 శాతం డివిడెండ్ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్ను దివీస్ లేబొరేటరీస్ బోర్డు సిఫారసు చేసింది.