For Money

Business News

కావేరి సీడ్స్‌కు నష్టాలు

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్స్‌ మార్చి నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.14.32 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసిక ఆదాయం రూ.59.70 కోట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో కంపెనీ రూ. 83.42 కోట్ల ఆదాయంపై రూ.9.35 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.1,034.99 కోట్లు కాగా, నికరలాభం రూ.305.31 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.929.81 కోట్లు కాగా, దానిపై అప్పట్లో రూ.251.26 కోట్ల నికరలాభం ఉంది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం చూస్తే… గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి కావేరీ సీడ్‌ కంపెనీ ఆదాయం రూ.1,082 కోట్లు, నికరలాభం రూ.311.20 కోట్లు నమోదయ్యాయి.