For Money

Business News

సెంట్రల్‌ బ్యాంక్‌కు భారీ నష్టాలు

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర నష్టం రూ.1,349.21 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,529.07 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంక్‌ లాభం రూ.887.58 కోట్లకు తగ్గింది. 2019-20 లాభం రూ.1121.35 కోట్లతో పోలిస్తే ఇది 20.84 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.6,723.73 కోట్ల నుంచి రూ.5,779.84 కోట్లకు తగ్గింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 18.92 శాతం నుంచి 16.55 శాతానికి తగ్గాయి.