For Money

Business News

ఈడీ విచారణకు విజయ్‌ దేవరకొండ

లైగర్‌ సినిమా హీరో విజయ్‌ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. లైగర్‌ సినిమా పెట్టుబడుల గురించి విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. ఇదే అంశానికి సంబంధించి ఈ సినిమా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సహ నిర్మాత చార్మిని కూడా ఈడీ అధికారులు ఇటీవల విచారించిన విషయం తెలిసిందే.