For Money

Business News

ఎన్‌డీటీవీ- మరో అప్పర్‌ సర్క్యూట్‌

ఎన్‌డీటీవీ కౌంటర్‌లో యాక్టివిటీ జోరుగా ఉంది. అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభ సమయంలో నష్టాలతో ముగిసిన ఈ షేర్‌ నిన్న, ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం విశేషం. నిన్న 5 శాతం పెరిగిన షేర్‌ ఇవాళ మరో 5 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ ప్రస్తుతంరూ. 446 వద్ద ట్రేడవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2021 నవంబర్‌ 30న ఈ షేర్‌ రూ.75 వద్ద ట్రేడైంది. ఎన్‌డీటీవీలో పరిస్థితి చాలా నాజూగ్గా మారింది. అదానీ గ్రూప్‌ 29.18 శాతం వాటా కొని… ఓపెన్‌ ఆఫర్‌ కింద వస్తున్న షేర్ల కోసం వెయిట్‌ చేస్తోంది. ఇపుడు ప్రణయ్‌ రాయ్‌కు కూడా 32 శాతం వాటా ఉంది. చిన్న చితకా కంపెనీలు మొన్న కొన్ని షేర్లను ఓపెన్‌ ఆఫర్‌ కింద అమ్మినా.. నిన్న, ఇవాళ ఎవరూ షేర్లను అమ్మడం లేదు. దీంతో అదానీ, ప్రణయ్‌ రాయ్‌ కాకుండా… మిగిలిన ఇన్వెస్టర్లు చాలా కీలకంగా మారారు. మరి ఎన్‌డీటీవీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ మార్కెట్‌లో నెలకొంది.