For Money

Business News

ఈడీ ఆఫీస్‌కు రావడం 20వ సారి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆఫీస్‌కు రావడం తనకు కొత్త కాదని.. గత పదేళ్ళలో ఈ ఆఫీస్‌కు వస్తూనే ఉన్నాని పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌ అన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. జగతీ పబ్లికేషన్స్‌లో ఆయన పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. తాను చాలా వ్యాపారాలు చేస్తున్నాని… ఇవాళ జగతి పబ్లికేషన్స్ అంశంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చానని ఆయన అన్నారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాము సమాధానాలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఆయన తెలిపారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు అడిగారని తెలిపారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వర ప్రసాద్‌… ఇపుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినీ నిర్మాతగా బిజీగా ఉన్నారు.