For Money

Business News

నోట్ల మార్పిడికి ఇవి తప్పదు

రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఆర్బీఐ… నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులకు సమర్పించి.. ఇతర నోట్లను పొందొచ్చు. అయితే దీని కోసం ఆర్బీఐ నిర్దేశించిన రిక్వెస్ట్‌ ప్రొఫార్మాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌లో డిపాజిట్‌దారుడు తన వివరాలు రాయడంతో పాటు సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్‌ గుర్తింపు పత్రాన్ని బ్యాంకు సిబ్బందికి చూపాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్‌, మనరేగా కార్డుతో పాటు పాపులేషన్‌ రిజస్టర్‌లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్‌ కాపీ బ్యాంకు సిబ్బందికి చూపాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు అకౌంట్‌ లేకున్నా నోట్ల మార్పిడికి బ్యాంకు సిబ్బంది అనుమతిస్తారు.