For Money

Business News

ఈనెల 15న 5జీ సేవలు ప్రారంభం?

5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించిన 24 గంటలలోనే రిలయన్స్‌ జియోకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలయన్స్‌ జియో 5జీ సేవలు ప్రారంభించే అవకాశముందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ను 5 జీ సేవలతో జరుపుకుంటామని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాష్‌ అంబానీ ఈ వారం ప్రారంభంలో అన్నారు. అయితే కచ్చిత తేదీ ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న జియో తన 5జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది. జియో చేతిలో 700 మెగాహెడ్జ్‌ బాండ్‌ ఉండటం ఆ కంపెనీకి అత్యంత ప్లస్‌ పాయింట్‌. ఈ బాండ్‌ కారణంగా కంపెనీ నెట్‌ వర్క్‌ క్వాలిటీ, ముఖ్యంగా ఇల్లు, ఆఫీస్‌ లోపల కూడా చాలా బాగుంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. ఇదే జరిగితే చాలా మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ నుంచి జియో మారే అవకాశముందని టెలికాం నిపుణులు అంటున్నారు.