For Money

Business News

అదానీ చేతికి ఏపీ టోల్‌ రోడ్లు..

మాక్వరీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ టోల్‌ రోడ్డు విభాగాన్ని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌ విలువ రూ.3,110 కోట్లు గుజరాత్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (GRICL), స్వర్ణ టోల్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ను (STPL) కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ATRL) ప్రకటించింది. GRICLలో మాక్వరీకి 56.8 శాతం వాటా ఉండగా.. స్వర్ణ టోల్‌వేలో ఈ సంస్థకు 100 శాతం వాటా ఉంది. 2022 సెప్టెంబర్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని భావిస్తున్నారు. స్వర్ణ టోల్‌వే కంపెనీకి 16వ నంబర్‌ నేషనల్ హైవేపై తడ నుంచి నెల్లూరు వరకు 110 కిలోమీటర్ల టోల్‌ రోడ్‌ ఉంది. ఎన్‌హెచ్‌-65పై నందిగామ- ఇబ్రహీంపట్నం- విజయవాడ మార్గంలో మరో 48 కిలోమీటర్ల టోల్‌ రోడ్లు కూడా ఉన్నాయి. చెన్నై, కృష్ణపట్నం వంటి కీలక పోర్టులను ఈ రోడ్లు కలుపుతున్నాయి.