For Money

Business News

రూ.15,000కే జియో ల్యాప్‌టాప్‌?

రిలయన్స్‌ జియో రూ. 15000లకే ల్యాప్‌టాప్‌ అందించనుంది. వచ్చే నెలలో ఈ ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. జియోబుక్‌ పేరుతో తీసుకురానున్న ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఆధారిత సిమ్‌తో పనిచేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి జియో కంపెనీ ఇప్పటికే క్వాల్‌కామ్‌, మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. క్వాల్‌కామ్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ను అందించనుండగా.. మైక్రోసాఫ్ట్‌ కొన్ని యాప్‌లకు విండోస్‌ ఓస్‌తో మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జియో బుక్‌పై రిలయన్స్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జియోబుక్‌ నవంబరులో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.