For Money

Business News

ఇన్ఫోసిస్ CEO జీతం రూ.71 కోట్లు

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ సీఈవో స‌లిల్ పారేఖ్ ఏడాది జీతం రూ.71 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. 2022లో ఆయ‌న‌కు వార్షిక ప‌రిహారం కింద రూ. 71 కోట్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆయన జీతాన్ని 43 శాతం పెంచినట్లు కంపెనీ పేర్కొంది. స‌గంపైగా జీతం ఆయ‌న‌కు స్టాక్ ఆప్షన్ ద్వారా వస్తుంది. 2020-21 ఏడాదికి రూ. 49.68 కోట్లు, 2019-20 ఏడాదికి రూ. 34.27 కోట్ల రెమ్యూన‌రేష‌న్‌ను సీఈవో స‌లిల్ తీసుకున్నారు. ఇటీవ‌ల సీఈవో, ఎండీగా స‌లిల్ పారేఖ్‌ను మరో అయిదేళ్ళు కొనసాగించేకు కంపెనీ నిర్ణయించింది. జూలై 2022 నుంచి మార్చి 2037 వ‌ర‌కు ఆయ‌న ఈ పదవిలో ఉంటారు.