వడ్డీ రేట్లలో మార్పు లేదు
ప్రస్తుతమున్న వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయరాదని ఆర్బీఐ నిర్ణయించింది. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ తరవాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఎంపీసీ సభ్యులు ఏకాభ్రియాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగనుంది. మార్కెట్లో డిమాండ్ పటిష్ఠంగా ఉందని గవర్నర్ తెలిపారు. అలాగే రీటైల్ ద్రవ్యోల్బణం ఊహించినదానికన్నా అధికంగా ఉందని అన్నారు.
