For Money

Business News

సుశీ ఇన్‌ఫ్రాలో సోదాలు

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీలో జీఎస్టీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని కంపెనీ ఆఫీసులో జరుగుతున్న ఈ సోదాల్లో 25 బృందాలతో సుమారు 150 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ కంపెనీకి ఇపుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కుమారుడు సంకీర్త్‌ రెడ్డి ఎండీగా ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతు ప్రసాద్‌ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. సుశీ ఇన్‌ఫ్రా ఆఫీసుతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపైనా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో ఈ కంపెనీ నుంచి రూ. 5.5 కోట్లు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులు, సంస్థలకు నిధులు వెళ్ళాయని టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.