For Money

Business News

పరిశ్రమలకు ప్రోత్సాహం

తూర్పు గోదావరి జల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ నెలకొల్పిన ఆల్కలీ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి అవకాశం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్ట్‌ అప్పగించిందని, సమస్యలు పరిష్కరించకుండా సంతకాలు చేసిందని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అవుతుంది. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్‌ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో బిర్లాతో కలిసి సీఎం జగన్‌ ప్లాంట్‌ను సందర్శించారు.