For Money

Business News

కియా ఈవీ బుకింగ్స్‌ డేట్‌ వచ్చేసింది

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ కంపెనీ కియా మోటార్స్‌ త్వరలోనే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని మన మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. కియా EV6 బుకింగ్స్‌ను మే 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మన మార్కెట్‌లో కేవలం కొన్ని లిమిటెడ్‌ ఎడిషన్‌ మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ6 కారును గత ఏడాది మార్చిలో కియా మోటార్స్‌ ప్రవేశపెట్టింది. యూరోపియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2022 అవార్డును కూడా ఈ కారు దక్కించుకుంది.
ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో తయారైంది. ఈ కారును ఒక్కసారి చార్జ్‌ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని ఈ కారు అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బుకింగ్స్‌ తరవాత ధరకు సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనుంది.