For Money

Business News

10 నుంచి గోల్డ్‌బాండ్స్‌… ధర రూ.4,786

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2021-22 తరువాతి విడత అమ్మకాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధర రూ. 4786గా ఆర్‌బీఐ నిర్ణయించింది. జవనరి 10 నుంచి 14 వరకు ఈ స్కీమ్‌ కింద బంగారం బాండ్లు అమ్ముతారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ పేమెంట్‌ చేసేవారికి గ్రాముకు రూ.50 రాయితీ లభిస్తుంది. ఇంతకుమునుపు ఆఫర్‌లో గ్రాము బంగారాన్ని రూ. 4791లకు ఆర్బీఐ అమ్మింది. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను విక్రయిస్తుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తించిన పోస్టాఫీసులు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కూడా ఈ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలుదారులు కేవీసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.