For Money

Business News

టీసీఎస్‌ షేర్ల బై బ్యాక్‌…12న నిర్ణయం

షేర్లను బైబ్యాక్‌ చేయాలని టీసీఎస్‌ నిర్ణయించింది. ఈనెల 12న జరిగే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అపుడే బైబ్యాక్‌కు సంబంధించిన ఇతర అంశాలను కంపెనీ వెల్లడించనుంది. ఇంతకుమునుపు 2020 డిసెంబర్‌లో కంపెనీ రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్‌ చేసింది. ఈ ఆఫర్‌ కింద కంపెనీ 5.33 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసిక ఫలితాలను కూడా అదే రోజు బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఇవాళ బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ రూ.3,584 వద్ద ముగిసింది.