For Money

Business News

600 ఎకరాలు కొన్న హెటెరోడ్రగ్స్‌

ఇటీవల వందల కోట్ల నోట్ల కట్టలతో ఐటీ అధికారులకు పట్టుబడిన హెటెరో డ్రగ్స్‌ హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అమెరికాకు చెందిన ఓ ఫండ్‌ నుంచి ఈ భూములు కొనుగోలు చేసింది. అమెరికా ఫండ్‌కు భారత్‌లో రెండు కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 600 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ రెండు కంపెనీలను టేకోవర్‌ చేయడం ద్వారా ఆ భూములను హెటిరో డ్రగ్స్‌ దక్కించుకుంది. ఒక్కో ఎకరా రూ. 60 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ డీల్‌ కింద హెటెరో డ్రగ్స్‌ రూ.360 కోట్లు చెల్లించినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ రాసింది. 2017లో బెంగళూరుకు చెందిన పురవంకర గ్రూప్‌ నుంచి రాయిదుర్గ్‌ ఐటీ బెల్ట్‌లో ఉన్న 20 ఎకరాలను రూ. 475 కోట్లకు హెటెరో కొనుగోలు చేసింది. ఈ భూమిని జాయింట్‌గా అభివృద్ధి చేసేందుకు బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజడ్‌ కార్ప్‌, కె రహేజా గ్రూప్‌తో హెటిరొ డ్రగ్స్‌ ఒప్పందం చేసుకుంది.