For Money

Business News

రూ.400 కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ

తమ సంస్థ హైదరాబాద్‌ సమీపంలో రూ.400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుందని జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి వెల్లడించారు. సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, జెమిని ఎడిబుల్స్‌ సంయుక్త భాగస్వామ్యంతో రిఫైనరీ పెట్టనున్నారు. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే ఫ్రీడమ్ ఆయిల్ పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రదీప్ చౌదరి సమావేశమై రిఫైనరీ ఏర్పాటు గురించి చర్చించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని కేటీఆర్‌ హామి ఇచ్చారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ పెట్టుబడి రాష్ట్రంలో వంటనూనెల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని జెమిని ఎడిబుల్స్ సంస్థ ఎండీ ప్రదీప్ తెలిపారు.