For Money

Business News

ఏపీకి రూ.4787 కోట్లు..

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. జూన్‌ నెలకు మూడో విడత కింద వివిధ రాష్ట్రాలకు రూ.1,18,280 కోట్లు జారీ చేసింది. ఇందులో ఒక విడత అడ్వాన్స్‌ మొత్తం కూడా ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు విడుదల అయ్యాయి. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను కేంద్రం రాష్ట్రాలకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా ఈ మొత్తాన్ని 14 విడతల్లో విడుదల చేస్తోంది.