For Money

Business News

ఏడాదిలో బైజూస్‌ ఐపీఓ

ఏడాది లేదా 18 నెలల్లో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… కంపెనీ ప్రగతిని ఇన్వెస్టర్లతో పంచుకోవాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 10,000 కోట్లను దాటనుందని ఆయన అన్నారు. తాము ఇటీవల కొనుగోలు చేసిన అన్ని కంపెనీలు లాభదాయకమైనవేనని ఆయన అన్నారు. ఇపుడు ఇతర దేశాల్లో కూడా తమ సంస్థను విస్తరింపజేస్తున్నామని ఆయన అన్నారు. కచ్చితగా ఐపీఓ ఎపుడో చెప్పలేనని… అయితే ఏడాదిలోగా రావాలని ప్రస్తుత ఆలోచన అని ఆయన అన్నారు. ప్రస్తుతం బైజూస్‌ విలువ 1650 కోట్ల డాలర్లుగా లెక్కిస్తున్నారు.