For Money

Business News

BPCL: నికరలాభం రూ.11,940 కోట్లు

మార్చితో ముగిసిన ఏడాదిలో బీపీసీఎల్‌ రూ. 11,940 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన నుమలిగర్‌ రిఫైనరీని రూ. 9,422 కోట్లకు అమ్మేసింది. అయితే రూ. 2,032 కోట్లు ఉద్యోగులకు, ఇతర ఖర్చులకు వెచ్చింది, దీంతో వెరశి ఈ అమ్మకం వల్ల కంపెనీకి రూ. 6,992 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం తీసేసినా.. కంపెనీకి రూ. 6,000 కోట్లపైనే నికర లాభం వచ్చినట్లు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 1,080 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కో షేర్‌కు రూ.58 చొప్పున ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.