For Money

Business News

హైదరాబాద్‌లో బాష్‌ కంపెనీ

జర్మనీకి చెందిన అంతర్జాతీయ కంపెనీ బాష్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో పాటు గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. బాష్‌ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిసి సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. జర్మన్‌ కంపెనీ బాష్‌ ఏర్పాటు చేయబోయే సెంటర్‌ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 2026 కల్లా హైదరాబాద్‌లో బాష్‌ సెంటర్‌ ప్రాంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.