For Money

Business News

ఏపీలో ఈడీ దూకుడు…26 మందికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. రూ. 234 కోట్ల మేరకు నిధుల మళ్ళించారని ఆరోపణలు. పలు షెల్‌ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్ళించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి విచారణకు సంబంధించి 26 మందికి నోటీసులు జారీ చేసింది. మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ లక్ష్మీ నారాయణకు నోటీసులు జారీ. ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్‌ కూడా నోటీసులు జారీ చేసిన ఈడీ. రేపు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులలో ఈడీ అధికారులు పేర్కొన్నారు.