For Money

Business News

పూర్తిగా అదానీ చేతికి గంగవరం‌!

గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు లేఖ రాసింది. ఈ మొత్తం లావాదేవీ నెలలో పూర్తవుతుందని తెలిపింది. పోర్టుకు అవసరమైన 1,800 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. తాజా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 10.4 శాతం వాటాతో పాటు 1,800 ఎకరాలు అదానీ పరం అయ్యాయి. ఈ కంపెనీ ఇందులో 58.1 శాతం వాటా డీవీఎస్‌ రాజు కుటుంబానికి, దుబాయ్‌కి చెందిన విండీలేక్‌సైడ్‌ అనే కంపెనీకి 31.5ు వాటాలు ఉన్నాయి. భూములు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం 10.4 శాతం వాటా తీసుకుంది. అదానీ గ్రూప్‌కు వాటా అమ్మే విషయం ఓ నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఆ కమిటీ నివేదిక బహిరంగ పర్చకుండానే అదానీకి అమ్మేసింది రాష్ట్ర ప్రభుత్వం.