For Money

Business News

భారత్‌లో యాహూ న్యూస్‌ మూసివేత

భారత్‌లో ఉన్న తన న్యూస్‌ వెబ్‌సైట్లను మూసివేయాలని యాహూ నిర్ణయించింది. యాహూ మాతృసంస్థ వెరిజాన్‌ మీడియా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత దేశంలో డిజిటల్‌ న్యూస్‌ మీడియా సంస్థల్లో విదేశీ సంస్థలు కేవలం 26 శాతం వరకే పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో డిజిటల్‌ మీడియా సంస్థలు నడపడం లాభదాయకం కాదని వెరిజాన్‌ మీడియా భావించింది. వెరిజాన్‌ నిర్ణయంతో భారత్‌లో యాహూ క్రికెట్‌, యాహూ ఫైనాన్స్‌, న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పలు ఇతర వెబ్‌సైట్లను మూసివేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఇవి మూతపడుతాయని కంపెనీ తెలిపింది.