For Money

Business News

ఈ నెలలోనే 5జీ సేవలు

ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. భాగస్వామ్య సంస్థలతో నెట్‌వర్క్‌కు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5జీ సేవలను పూర్తి స్థాయిలో ఈనెలలోనే తమ కస్టమర్లకు అందిస్తామని తెలిపింది. పలు రకాల సంస్థలతో ఒప్పందం చేసుకోవడం వల్ల అల్ట్రా హైస్పీడ్‌ నుంచి భారీ డేటాను హ్యాండిల్‌ చేసే సామర్థ్యమున్న భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. నెట్‌వర్క్‌ భాగస్వామ్య సంస్థలుగా ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో రూ.43,084 కోట్లు వెచ్చించి స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.