For Money

Business News

అంచనాల మేర ఫలితాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా రూ.7,297 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే మార్చితో ముగిసిన మూడు నెలల కాలం అంటే జనవరి‌-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికర నష్టం రూ. 6544 కోట్లతో పోలిస్తే… కాస్త పెరిగినట్లు అన్పిస్తోంది. అలాగే మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో టర్నోవర్‌ రూ. 10239 కోట్ల నుంచి రూ.10410 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం గత నాలుగు త్రైమాసికాలుగా పెరుగుతూ వస్తోంది. ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (Average Revenue per User- ARPU) గత త్రైమాసికంతో పోలిస్తే రూ. 115 నుంచి రూ. 128కి పెరిగింది. టారిఫ్‌లను పెంచడమే దీనికి ప్రధాన కారణం. కస్టమర్ల సంఖ్య బాగా పడిపోతోంది. మార్చి నెలాఖరున 24.38 కోట్లుగా ఉన్న మొత్తం కస్టమర్ల సంఖ్య జూన్‌ నెలాఖరుకు 24.04 కోట్లకు తగ్గింది.