BUY &SELL: యాక్సిస్ బ్యాంక్, టైటాన్
నిన్న మార్కెట్ తన ప్రధాన అవరోధాన్ని అవలీలగా దాటేసింది. రెండో ప్రధాన అవరోధం 14,950ని కూడా ఇవాళ క్రాస్ చేసి 15,000పైన ప్రారంభం కానుంది. అమెరికా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్ గ్రీన్లో ఉంటోంది. డే ట్రేడర్స్కు ఇవాళ యాక్సిస్ బ్యాంక్, టైటాన్లను కొనుగోలు చేయమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ ధర్మేష్ షా సలహా ఇస్తున్నారు. ఈటీ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షేర్ను రూ. 680 స్టాప్ లాస్తో రూ. 770 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 709 వద్ద ట్రేడవుతోంది. అలాగే టైటాన్ షేర్ను రూ. 1,398 స్టాప్లాస్తో రూ. 1,575 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 1466 వద్ద ట్రేడవుతోంది.