నేడూ పెట్రోల్ మంట… రూ. 100 దగ్గరగా
పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి. పెట్రోల్ ధరను 27 సైసలు, డీజిల్ ధరను 31 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ముంబైలో పెట్రోల్ ధర రూ. 99.14లకు చేరింది. డీజిల్ ధర రూ.92.85కు పెరిగింది. ఇది ముంబైలో ఆల్టైమ్ రికార్డు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం చెన్నైలో పెట్రోల్ ధర రూ.94.54, కోల్కతాలో రూ. 92.92కు చేరింది. వ్యాట్ కారణంగా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా అధికంగా ఉండే అవకాశముంది.