వ్యాక్సిన్ ధరలు తగ్గింపు?
వ్యాక్సిన్ ధరలను తగ్గించాల్సిందిగా భారత్ బయోటెక్తో పాటు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ నేతృత్వంలో ఇవాళ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వ్యాక్సిన్ ధరల గురించి చర్చించారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కంపెనీలు భారీ లాభాలు కోసం ప్రయత్నిస్తున్నాయని వివిధ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.దీనిపై ఇవాళ సమావేశంలో చర్చించి… వ్యాక్సిన్ ధరలు తగ్గించాల్సిందిగా కంపెనీలను కేంద్రం కోరింది. దీంతో రెండు కంపెనీలు త్వరలోనే తమ వ్యాక్సిన్ ధరలను తగ్గించనున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా సరఫరా చేసే వ్యాక్సిన్ ధరను సీరమ్ రూ. 600, భారత్ బయోటెక్ రూ. 1200లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.