విమానాల్లో మాస్క్ తప్పనిసరికాదు
కోవిడ్ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన పలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తోంది. విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పని అంటూ ఈ ఏడాది మే 10వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను కేంద్ర పౌరవిమానయాన శాఖ సమీక్షించింది. కేంద్రం ఆరోగ్యశాఖతో సంప్రదించిన తరవాత విమానాల్లో మాస్క్ తప్పనిసరి అనే నిబంధనలను ఎత్తివేసింది. అయితే మాస్క్ ధరలించాల్సిందిగా విమానంలోపల అనౌన్స్మెంట్ ఉంటుందని… కాని మాస్క్ ధరించకపోతే ఫైన్ వేస్తామన్న నిబంధన అమలు చేయడం లేదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అంటే ఇష్టమున్నవారు ధరించవచ్చు. ధరించనివారపై మాత్రం ఫైన్ ఉండదు.