For Money

Business News

తెలంగాణలో రెండు ‘జాకీ’ ప్లాంట్లు

జాకీ బ్రాండ్‌తో లోదుస్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలంగాణలో రెండు యూనిట్లను నెలకొల్పనుంది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు. తరవాత రాష్ట్ర ప్రభత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం, ములుగు వద్ద ఈ రెండు ప్లాంట్లను నెలకొల్పుతారు. ఏడాది కోటి యూనిట్లు తయారు చేసే ఈ ప్లాంట్ల వల్ల 7000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.