నేడూ పెట్రో మంట
దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఇవాళ కూడా లీటరుకు పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలు చొప్పన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈనెల 4వ తేదీ నుంచి క్రూడ్ ధరలను పెంచడం ఇది ఏడవసారి. పెరిగిన ధరలకు వ్యాట్ కూడా తోడవుతుంది. దీంతో రాష్ట్రాల్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉంటుంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 98.36లకు చేరగా, డీజిల్ ధర 89.75కు పెరిగింది.