For Money

Business News

గో డిజిట్‌ ఐపీఓకు బ్రేక్‌!

కెనాడాకు చెందిన ప్రముఖ సంస్థ ఫెయిర్‌ ఫ్యాక్స్‌ గ్రూప్‌ మద్దతు ఉన్న గో డిజిట్‌ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు సెబీ పేర్కొంది. అయితే కారణాలు మాత్రం పేర్కొనలేదు. ఐపీఓ కోసం ఆగస్టు 17వ తేదీన ప్రాస్పెక్టస్‌ను కంపెనీ దాఖలు చేసింది. ఈ కంపెనీలో ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టారు. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 1250 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. కంపెనీలో ఉన్న ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులు తమ వద్ద ఉన్న 10.94 కోట్ల షేర్లను అమ్మాలని ప్రతిపాదించారు.