జొమాటో మరో 10% డౌన్
పే టీఎం తరవాత జొమాటో ఇన్వెస్టర్లకు షాక్ ఇస్తోంది. పే టీఎం షేర్… లిస్టింగ్ తరవాత ఒక్కసారి కూడా ఆఫర్ ప్రైజ్ను చేరలేదు. జొమాటో రూ. 115 నుంచి రూ. 169కి చేరినా.. ఇవాళ రూ. 100.75 కేనిష్ట స్థాయిని చేరింది. ఇవాళ ఒక్కరోజే ఈ షేర్ పది శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. జొమాటొతోపాటు నష్టాల్లో ఉన్న కొత్త తరం కంపెనీలలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో టెక్, ఐటీ కంపెనీల్లో వొస్తున్న ఒత్తిడి ఇక్కడా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. పేటీఎం షేర్ కూడా ఇవాళ మరో 2 శాతం క్షీణించి రూ.938కి చేరింది.