For Money

Business News

అదానీ చేతికి జీ న్యూస్‌ ఛానల్స్‌?

జీ మీడియా (పాత పేరు జీ న్యూస్‌)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆ కంపెనీ ఖండించింది. ఎస్సెల్‌ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రకు చెందిన జీ మీడియా టేకోవర్‌పై పలు కథనాలు వస్తున్నాయి. గౌతమ్‌ అదానీ ఇప్పటికే సుభాష్‌ చంద్రతో ప్రాథమిక చర్చలు జరిపారని… మొత్తం నగదు చెల్లించి కంపెనీలను టేకోవర్‌ చేస్తారని వార్తలు వస్తున్నారు. దీన్ని ఖండించిన జీ మీడియా, వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. కావాలని కొంత మంది ఇలాంటి దుష్ర్రచారం చేస్తున్నారని… ఈ కథనాల వెనుక ఎవరు ఉన్నారో సెబీ దర్యాప్తు చేయాలని జీ మీడియా డిమాండ్‌ చేస్తోంది.