For Money

Business News

రికార్డు లాభాలు ప్రకటించిన దివీస్‌

దివీస్‌ ల్యాబ్‌ మరోసారి అద్భుత ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 902 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2020 డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ. 470.62 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం 92 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా 46 శాతం పెరిగి రూ. 1701 కోట్ల నుంచి రూ. 2493 కోట్లకు చేరింది. నిజానికి కంపెనీ నికరలాభం రూ.690 కోట్లు ఉంటుందని మార్కెట్‌ అంచనా వేసింది. కంపెనీ Ebitda కూడా 44 శాతం పెరిగి రూ. 1097 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో కంపెనీరూ. 6,446 కోట్ల ఆదాయంపై రూ.2066 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.