For Money

Business News

ఈ నెలాఖరులో రుచి సోయా FPO

పతంజలి ఆయుర్వేదకు చెందిన రుచి సోయా కంపెనీ ఈ నెలాఖరులో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చేయనుంది. ఈ ఇష్యూ కింద రూ. 4,300 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ఆఫర్‌ చేస్తుంది. ప్రస్తుతం కంపెనీలో పతంజలి ఆయుర్వేదకు 99 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు 75 శాతం మించి వాటా ఉండరాదు. మూడేళ్ళలో మిగిలిన 25 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొంత వాటాను ఇపుడు రుచి సోయా విక్రయించదలచింది. వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను గత ఏడాది జూన్‌లోనే దాఖలు చేయగా, ఆగస్టులో సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఎందుకో కంపెనీ అప్పటి నుంచి ఆఫర్‌ చేయలేదు. ఇపుడు ఈనెల చివరి వారంలో ఎఫ్‌పీఓకు రెడీ అవుతోంది.