For Money

Business News

‘ఎస్’ బ్యాంకు: 16 శాతం పెరిగిన షేర్లు

‘ఎస్’ బ్యాంకు షేర్లు ఇవాళ మార్కెట్‌లో దూసుకెళ్ళాయి. ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఆరు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్ఈలో ఈ షేర్‌ ఒకదశలో రూ.1 2.85కు చేరింది. తరవాత స్వల్పంగా తగ్గి రూ. 12.60 వద్ద 13.5 శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కౌంటర్‌లో 77 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. జీ గ్రూప్‌ కంపెనీలతో ఎస్‌ బ్యాంక్‌ భారీ లావాదేవీలు ఉన్నాయి. డిష్‌ టీవీలో జీ ప్రమోటర్లను దిగొపొమ్మని ఎస్‌ బ్యాంక్‌ స్వయంగా కోరగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలోనూ జీ ప్రమోటర్లను రాజీనామా చేయమని ఆ కంపెనీ ప్రమోటర్లు కోరుతున్నారు. వాస్తానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడా ఎస్‌ బ్యాంక్‌కు కీలక లావాదేవీలు ఉన్నాయి. మొత్తానికి జీ గ్రరూప్‌ కంపెనీల షేర్లలో వచ్చిన మార్పు.. ఎస్‌ బ్యాంక్‌లోనూ కన్పిస్తోంది. డిష్‌ టీవీ కూడా ఇవాళ 10 శాతం లాభంతో రూ. 21.25 వద్ద ముగిసింది.