For Money

Business News

టెక్‌ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ

వాల్‌ స్ట్రీట్‌ మిశ్రమంగా ఉంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు గ్రీన్‌లో ఉండగా, డౌ జోన్స్‌ నష్టాల్లో ఉంది. టెక్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. నాస్‌డాక్‌ 1.32 శాతం లాభంతో ట్రేడవుతుండగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ లాభాలు 0.45 శాతం గ్రీన్‌లో ఉన్నాయి. డౌజోన్స్‌ స్వల్ప నష్టంతో ఉంది. ఇవాళ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా కోలుకంది. డాలర్‌ ఇండెక్స్‌ 0.2 శాతం పెరిగి 98.18 వద్ద ట్రేడవుతోంది. ఇక క్రూడ్‌ మార్కెట్‌ కూడా గ్రీన్‌లో ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 107.15 వద్ద ఉండగా, WTI క్రూడ్‌ 104.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిన్న బాగా పెరిగిన వెండి ఇవాళ 2 శాతం నష్టపోగా, బంగారం కూడా 0.75 శాతం నష్టపోయింది.