For Money

Business News

వొడాఫోన్‌లో ప్రమోటర్ల తాజా పెట్టుబడి

వొడాఫోన్‌ ఐడియా కంపెనీలో ప్రమోటర్లయిన వొడాపోన్‌ ఇన్‌కార్పొరేటెడ్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ తాజాగా రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ మేరకు వారికి తాజా ఈక్విటీ జారీ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.13.30 చొప్పున 339 కోట్ల షేర్లు జారీ చేస్తారు. రూ. 10,000 కోట్లను వివిధ ఈక్విటీ సాధనాల ద్వారా సమీకరించే ప్రతిపాదనకు కూడా కంపెనీ ఆమోదం తెలిపింది. నిధుల సమీకరణ ప్రణాళికను ఆమోదించేందుకు ఈనెల 23న కంపెనీ అసాధారణ సమావేశం జరుగనుంది. గత వారంలో ఇండస్‌ టవర్‌లోతనకు ఉన్న 2.4 శాతం వాటాను రూ. 1442 కోట్లకు వోడాఫోన్‌ అమ్మేసిన విషయం తెలిసిందే. అనేక మార్గాల ద్వారా కంపెనీ నిధులను సమీకరిస్తోంది.