ప్రైమరీ మార్కెట్కు అర్బన్ కంపెనీ

మొబైల్ యాప్ ద్వారా బ్యూటీ, హోమ్ కేర్ సర్వీసులు అందిస్తున్న అర్బన్ కంపెనీ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానుంది. టైగర్ గ్లోబల్ ఆర్థిక అందండలు ఉన్న ఈ కంపెనీ ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 1900 కోట్లను సమీకరించనుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. నిజానికి ఈ ఆఫర్… చాలా వరకు మొత్తం ప్రస్తుత ఇన్వెస్టర్ల తమ వాటాను అమ్ముకునేందుకు ఉద్దేశించనదే. ప్రతిపాదిత ఆఫర్లో కంపెనీ ప్రమోటర్లు సుమారు రూ. 1471 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే మొత్తం రూ౦. 429 కోట్లు. అంటే ప్రమోటర్లు తమ వాటాను విక్రయించేందుకే ఈ ఆఫర్ చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించే మొత్తం అంటే రూ. 429 కోట్లలో సగం మొత్తం కొత్త టెక్ ఆఫరింగ్ను డెవలప్ చేసేందుకు వినియోగిస్తారు. మిగిలిన మొత్తం ఆఫీస్ లీజింగ్, మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీ భారత్, యూఏఈ, సౌదీ అరేబియాలలో 59 నగరాల్లో సేవలు అందిస్తోంది.