For Money

Business News

ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌కు దరఖాస్తు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ లైసెన్స్‌ 2018తో ముగియడంతో దానిని రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేయలేదని… దీంతో సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3 కోట్ల జరిమానా చెల్లించినట్లు ఆయన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై తితిదేపై ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలకు ఆయన ఈ వివరణ ఇచ్చారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించినందుకు టీటీడీపై జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.